మందులకు తగ్గే జబ్బులకు కూడా శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు.. 465 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు

  • అమెరికా వైద్యుడి ధనాశ
  • అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు
  • ఫిర్యాదు చేసిన మహిళలు
అమెరికాలోని ఓ డాక్టర్ కు భారీగా జైలు శిక్ష పడింది. ఆ డాక్టర్ పేరు జావేద్ పర్వేజ్. వర్జీనియాలో ఉండే ఈ వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు అవసరం లేకపోయినా శస్త్రచికిత్సలు చేసేవాడు. మందులకు జబ్బు తగ్గే అవకాశం ఉన్నా ఆపరేషన్ చేయాలని చెప్పేవాడు. ఎక్కువగా గర్భసంచి సంబంధిత శస్త్రచికిత్సలు చేసేవాడు. ఈ విధంగా పదేళ్లలో 52 మందికి అనవసర శస్త్రచికిత్సలు చేసినట్టు గుర్తించారు.

ఓ డాక్టర్ 10 ఏళ్ల కాల వ్యవధిలో 7.63 శాతం మంది రోగులకు ఆపరేషన్లు చేస్తారనుకుంటే, వర్జీనియా వైద్యుడు జావేద్ పర్వేజ్ మాత్రం 41.26  శాతం మంది రోగులకు ఆపరేషన్లు చేశాడు. డబ్బు కోసం ఆశపడి ఈ విధంగా వ్యవహరించినట్టు తేలింది. ఆపరేషన్ల పేరిట ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థల నుంచి లక్షల్లో డబ్బులు రాబట్టాడు. ఈ డాక్టర్ పై 29 మంది మహిళలు ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో అతడి దురాశ నిజమేనని వెల్లడైంది. దాంతో వర్జీనియా న్యాయస్థానం అన్ని అభియోగాలను నిజమేనని నిర్ధారించి 465 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Javed Parwaiz
Virginia
Doctor
Surgeries
Court

More Telugu News